ప్రైవేట్ కాలేజీలో చేర్పించలేదని ఓ విద్యార్థిని ఆత్మహత్య

ప్రైవేట్ కాలేజీలో చేర్పించలేదని ఓ విద్యార్థిని ఆత్మహత్య

విద్యా వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్తున్నా.. ఆచరణ అందుకు దూరంగానే ఉంటోంది. విద్యార్థులు సైతం ప్రభుత్వ బడులకు, కాలేజీలకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. అరకొర చదువులు నాకొద్దంటూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తనను ప్రైవేట్ కాలేజీలో చేర్పించండని.. ఆ అమ్మాయి తన తల్లిదండ్రులను కోరింది. వాళ్లేమో.. మనకు అంత స్తోమత లేదు.. ప్రభుత్వ కాలేజీకే వెళ్లమని సర్దిచెప్పారు. దీంతో.. మనస్తాపానికి గురైన విద్యార్థిని ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story