తలపై నుంచి వాహనం టైర్లు దూసుకెళ్లడంతో..
By - TV5 Telugu |6 Sep 2019 5:06 AM GMT
హైదరాబాద్ నగరశివారులోని శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుడు నాగర్కర్నూలు జిల్లాలోని గోపాలపురం గ్రామానికి చెందిన చాంద్షాగా పోలీసులు గుర్తించారు. శంషాబాద్ మండలంలోని తొండుపల్లి వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చాంద్షా స్పాట్లోనే చనిపోయాడు. వాహనం టైర్లు తలపై నుంచి దూసుకుపోవడంతో మృతదేహం నుజ్జునుజ్జయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com