పెళ్లయిన రోజే భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

పెళ్లయిన రోజే భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

రాబోయే కొత్త జీవితం రంగులమయంగా ఉంటుందని కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నవవధువుకి తొలిరేయే.. చివరి రేయిగా మారింది. కట్టుకున్న భర్తే ఆమె పాలిట మానవమృగమయ్యాడు. తొలిరాత్రి భార్యను హత్యచేసి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి తాలూకు సోమంజేరి గ్రామానికి చెందిన నిధివాసన్‌ (27) సడయన్‌కుప్పం గ్రామానికి చెందిన సంధ్య(22) కు జనవరిలో వివాహం నిశ్చమైంది. జూన్‌ 10న వివాహం జరిగింది. నిధివాసన్ క్రేన్‌ ఆపరేటర్‌ గా పనిచేస్తున్నాడు. కట్నంగా బంగారు నగలు ద్విచక్ర వాహనం, ఇతర సామగ్రి ఇచ్చారు.

బుధవారం తొలిరాత్రికి ఏర్పాట్లు చేశారు కుటుంబసభ్యులు. అయితే అర్ధరాత్రి సమయంలో యువతి గట్టిగా కేకలు వేసింది. కుటుంబసభ్యులు పట్టించుకోలేదు. అయితే గురువారం ఉదయం మూడు గంటలకు యువకుడు నీధివాసన్‌ తలుపులు తెరుచుకుని, గట్టిగా కేకలు వేస్తూ పరుగులు పెట్టడంతో కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనుమానంతో గదిలోకి వెళ్లి చూడగా సంధ్య రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో సంధ్య కుటుంబసభ్యులు కాట్టూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పరిశీలించగా, ఆమెను పదునైన గడ్డపారతో పొడిచి దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలో పరారీలో ఉన్న నిధివాసన్‌ కోసం గాలింపు చేపట్టారు. అయితే గ్రామ సమీపంలోని వేపచెట్టుకు అస్థను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు కొందరు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఆ యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. నిధివాసన్‌ గంజాయి, మద్యం అలవాట్లు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. దీనికి అలవాటుపడిన నిధివాసన్ మానసిక రోగిలా మారాడు. అంతకుముందే దాదాపు మూడునెలల పాటు మానసిక వైద్యశాలలో చికిత్స కూడా తీసుకున్నాడని పోలీసులకు తెలిసింది.

Tags

Read MoreRead Less
Next Story