అయ్యప్ప దర్శనానికి సిద్ధమైన మహిళపై కారం పొడి, పెప్పర్ స్ప్రేతో దాడి

అయ్యప్ప దర్శనానికి సిద్ధమైన మహిళపై కారం పొడి, పెప్పర్ స్ప్రేతో దాడి

bindu

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లేందుకు సిద్ధమైన మహిళపై దాడి జరిగింది. కేరళకు చెందిన బిందు అనే మహిళపై మంగళవారం ఓ వ్యక్తి కారం పొడి చల్లాడు. ఆ తర్వాత పెప్పర్ స్ప్రే ప్రయోగించాడు. ఎర్నాకుళం సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందే ఈ ఘటన జరిగింది. తృప్తి దేశాయ్‌తో కలిసి సన్నిధానానికి వెళ్లితీరుతానని ప్రకటించిన నేపథ్యంలోనే కొందరు హిందుత్వ వాదులు ఆమె తీరుపై మండిపడ్డారు. చివరికి ఆమెపై కారం పొడి, పెప్పర్ స్ప్రేతో దాడి చేశారు.

ఈ ఏడాది జనవరి 2న బిందు శబరిమలకు వెళ్లింది. ఈసారి కూడా అయ్యప్పను దర్శనం చేసుకుంటానని.. తమకు సెక్యూరిటీ కల్పించకపోయినా వెళ్లి తీరతానని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమెపై ఎటాక్ జరిగింది. ఇది పెను సంచలనంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story