ప్రజావేదిక విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధం

ప్రజావేదిక విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధం

అమరావతి ప్రజావేదికపై అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధం మొదలైంది. ప్రతిపక్ష నేతగా, పార్టీ అధినేతగా తనను కలిసేందుకు నిత్యం వందల మంది వస్తారని... నివాసానికి అనుబంధంగా ఉన్న ప్రజావేదిక కేటాయించాలని చంద్రబాబు సీఎం జగన్ కు లేఖ రాశారు. అయితే సీఎం అధికారిక, అనధికార కార్యక్రమాలు నిర్వహించడానికి కార్యాలయం అవసరమని.. ప్రజావేదిక ఇవ్వాలని వైసీపీ నేతలు సీఎస్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. జెడ్ ప్లస్ కేటగిర భద్రత కూడా ఉన్న చంద్రబాబు నివాసానికి ఆనుకుని ఉన్న భవనం అధికారపార్టీకి ఎలా కేటాయిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story