మరో అరుదైన రికార్డును సాధించిన విరాట్‌కోహ్లీ

మరో అరుదైన రికార్డును సాధించిన విరాట్‌కోహ్లీ

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ మరో అరుదైన రికార్డును సాధించాడు. శ్రీలంకతో శనివారం జరిగిన మ్యాచ్‌లో 34 పరుగులు చేసి నాటౌట్‌ నిలిచిన కోహ్లీ...ప్రపంచకప్‌లో 5 ఇన్నింగ్స్‌లలో 1000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ 44 ఇన్నింగ్స్‌లో 2 వేల 278 పరుగులు చేయగా... సౌరవ్‌ గంగూలీ 21 ఇన్నింగ్స్‌లో 1006 పరుగులు సాధించాడు. ఇక ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన నాలుగో క్రికెటర్‌గా నిలిచాడు హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ.

Tags

Read MoreRead Less
Next Story