డిగ్రీ అర్హతతో 'ఈపీఎఫ్ఓ'లో ఉద్యోగాలు..

డిగ్రీ అర్హతతో ఈపీఎఫ్ఓలో ఉద్యోగాలు..

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 2,189 ఖాళీలున్నాయి. తెలంగాణలో 151, ఆంధ్రప్రదేశ్‌లో 60 ఖాళీలున్నాయి. డిగ్రీ పాసైన వారి నుంచి దరఖాస్తుల్ని కోరుతోంది. డిగ్రీతో పాటు డేటా ఎంట్రీ వర్క్ తెలిసి ఉండాలి. వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉన్నవారు అర్హులు. దరఖాస్తు చేయడానికి జులై 21 చివరి తేదీ. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో పాసైన వారికి కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

దరఖాస్తు ప్రారంభం: 2019 జూన్ 27.. దరఖాస్తు ముగింపు: 2019 జులై 21 సాయింత్రం 5 గంటల వరకు.. ఆన్‌లైన్ ఎగ్జామ్: ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు రూ.250, ఇతరులకు రూ.500.. దరఖాస్తు ఫ్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 2019 ఆగస్ట్ 5

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, డేటా ఎంట్రీ వర్క్ తెలిసి ఉండాలి.. వయసు: 18 నుంచి 27 ఏళ్లు

వెబ్‌సైట్: www.epfindia.gov.in

Tags

Read MoreRead Less
Next Story