ఆ మ్యాచ్‌లో ధోనీకి ఛాన్స్‌ ఉండదా..?

ఆ మ్యాచ్‌లో ధోనీకి ఛాన్స్‌ ఉండదా..?

వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ధోనీ తన రిటైర్మెంట్ పై ప్రకటన చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి హింట్స్ ఇవ్వలేదు మిస్టర్ కూల్. ఇంతకీ ధోనీ మనసులో ఏముంది? ఇంకా కొంతకాలం ఆడాలనుకుంటున్నాడా? లేక ఫేర్ వెల్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్ లో జరిగిన వరల్డ్ కప్ లో ధోనీ సూపర్ హిట్టయ్యుంటే.. రిటైర్మెంట్ పై ఎవరూ వేలెత్తిచూపేవారు కాదు. కానీ గొప్ప ఫినిషర్ గా పేరున్న ఈ జార్ఖండ్ డైనమెట్ ఈసారి సరిగా పేలలేదు. అందుకే ఇప్పుడంతా అతడి రిటైర్మెంట్ పైనే చర్చ నడుస్తోంది.

కొంత కాలంగా ధోనీ వేగం తగ్గింది. ఒకప్పటిలా ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. అయితే ఐపీఎల్‌లో ఫర్వాలేదనిపించడంతో వరల్డ్ కప్ లోనూ ఆ జోష్ చూపిస్తాడని అంతా భావించారు. కానీ స్లాగ్ ఓవర్లలో వేగంగా పరులుగు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో బ్యాటింగ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అటు కీలకమైన సెమీస్ లో నూ మిస్టర్ కూల్ ని దురదృష్టం వెంటాడటంతో రనౌట్ అయ్యాడు.. దీంతో ధోనీ రిటైర్మెంట్‌ టైమొచ్చిందన్న వాయిస్‌ మళ్లీ వినబడుతోంది..

ధోనీ అత్యుత్తమ కీపరే అయినా.. కేవలం కీపింగ్ స్కిల్స్ తో జట్టులో చోటుని స్థిరపరుచుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. పైగా ధోనీకి వయస్సు కూడా 38 సంవత్సరాలు దాటిపోయింది. మరో వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ ఎలాగూ లేదు గనుక ఇప్పుటే తప్పుకోవాలన్న డిమాండ్స్ పెరిగిపోయాయి.

త్వరలోనే వెస్టిండీస్ టూర్ ఉంది. అందులో టీ-ట్వంటీలు, వన్డేలతోపాటు టెస్టులు కూడా ఆడనుంది టీమిండియా. ఇందుకోసం జట్టును ప్రకటించాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఆ తేదీ ఖరారు కాలేదు. ధోనీ రిటైర్మెంట్‌పై క్లారిటీ లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. త్వరలోనే చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్.. ధోనీని కలువనున్నట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత రిటైర్మెంట్ పై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ తనంత తానుగా తప్పుకునేందుకు ధోనీ ఒప్పుకోకపోతే.. టీంలోకి సెలక్ట్ చేయకపోవచ్చని సమాచారం. అదే జరిగితే ధోనీకి చాలా పెద్ద అవమానం కిందే లెక్క. అందుకే అతడిని గౌరవంగా తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధోనీయే స్వయంగా రిటైర్మెంట్ ప్రకటిస్తే.. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే లెజెండ్ క్రికెటర్ అయిన ధోనికి ఫేర్ వెల్ మ్యాచ్ ఆడే ఛాన్స్ ఇవ్వాలన్న డిమాండ్ కూడా వినిపిసోంది.

2020లో టీ-ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టాల్సి ఉంటుంది. ధోనీ తప్పుకుంటే ఆ ప్లేస్ ను భర్తీ చేసేందుకు.. రిషబ్ పంత్ సిద్ధంగా ఉన్నాడు. వాస్తవానికి మొన్నటి వరల్డ్ కప్ టీమ్ లోనే ఈ మార్పు జరగాల్సింది. అయితే అనుభవానికే పెద్దపీట వేసిన సెలక్టర్లు.. ధోనిని తప్పించే సాహసం చేయలేదు. కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చిందని మెజార్టీ క్రికెటర్లు అభిప్రాయ పడుతున్నారు. ధోనీ తప్పుకొని యువతరానికి ఛాన్స్ ఇవ్వాలన్న డిమాండ్ పెరిగిపోతోంది. మరి, ధోనీ ఈ సైలెన్స్‌ను బ్రేక్‌ చేస్తారా.. లేదో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story