గోవులు మృత్యువాత.. పోస్ట్‌మార్టం రిపోర్టులో సంచలన విషయాలు

విజయవాడలో కొత్తూరు తాడేపల్లి గోశాలలో 100 గోవులు మృత్యువాత పడడంపై పోస్ట్‌మార్టం ప్రిలిమినరీ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరిపడని ఆహారం తినడం వల్లే గోశాల ఆవులు మృత్యువాత పడ్డాయని.. పోస్టుమార్టం ప్రిలిమినరి నివేదిక పేర్కొంది. గడ్డి మినహా పొట్టలో ఎలాంటి ఆహారం లేదని నిర్ధారణ చేశారు. గోవుల ఊపిరితిత్తులు, గుండెపై రక్తపు చారలు కనిపించాయి. గోవుల ఊపిరితిత్తుల్లో నీరు.. ముక్కులోంచి రక్తం బయటకొచ్చాయి. ఉదయం భావించినట్టు పొట్ట ఉబ్బరం మరణానికి కారణం కాదని వైద్యులు తేల్చారు.

Tags

Read MoreRead Less
Next Story