పాకిస్తాన్ మరో దుశ్చర్య
By - TV5 Telugu |11 Aug 2019 6:28 AM GMT
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో రగిలిపోతోన్న పాకిస్థాన్.. మరో దుశ్చర్యకు పాల్పడింది. లాహోర్ లోని సిక్కు పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. గుర్తుతెలియని కొందరు ఆందోళనకారులు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అనంతరం వీధుల వెంట కేకలు వేసుకుంటూ వెళ్లినట్టు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న లాహోర్ సిటీ అధికార ప్రతినిధి తానియా ఖురేషి.. విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దెబ్బతిన్న విగ్రహాన్ని బాగు చేయించి తిరిగి ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాల్లో అల్లరి మూకలు రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com