కశ్మీర్పై రాద్దాంతం చేస్తున్న చైనాకు గట్టి షాక్!
కశ్మీర్పై రాద్దాంతం చేస్తున్న చైనాకు గట్టి షాక్ తగిలింది. కశ్మీర్తో కలవరం పుట్టించాలని చైనా వేసిన ఎత్తుగడను భారత ప్రభుత్వం తిప్పికొట్టింది. చైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడర్కు మోదీ సర్కారు ఎసరుపెట్టింది. అసలు పాక్ ఆక్రమిత కశ్మీర్లో మీకు పనేంటని చైనాను గట్టిగా నిలదీసింది. పీఓకేలో నిర్మాణాలు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించింది. రోడ్డు మార్గాలు ఎందుకు వేస్తున్నారని మండిపడింది. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడర్ను అంగీకరించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. పీఓకే తమదే అని, ఇందులో రెండో అభిప్రాయానికి అవకాశమే లేదని తేల్చి చెప్పింది. జమ్మూకశ్మీర్ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది.
చైనా విదేశాంగమంత్రి వాంగ్యు ఇటీవల పాకిస్థాన్లో పర్యటించారు. ఈ సందర్భంగా కశ్మీర్ అంశాన్ని చైనా, పాక్ నాయకులు ప్రస్తావించారు. కశ్మీర్పై భారత ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆర్టికల్-370 రద్దుతో తమ సార్వభౌమత్వాన్ని భారత్ దెబ్బతీస్తోందని వితండవాదన చేశారు. నిజానికి జమ్మూకశ్మీర్ మొత్తం భారతదేశానికి చెందుతుంది. దేశ విభజన అనంతరం పాకిస్థాన్, చైనాలు దురాక్రమణ జరిపి కశ్మీర్లోని కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయి. అవే పీఓకే, అక్సాయ్ చిన్లు. ఈ రెండు ప్రాంతాలు తమవి కావనే విషయం పాక్, చైనాలకు స్పష్టంగా తెలుసు. ఐనప్పటికీ దొంగే.. దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. పైగా, పీఓకే, అక్సాయ్ చిన్లు తమ జాగీర్లు అనుకుంటూ ఎడాపెడా నిర్మాణాలు చేపడుతున్నాయి. ఆ క్రమంలోనే చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడర్ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్టు పీఓకే ద్వారానే వెళ్తుంది. సరిగ్గా ఈ పాయింట్నే భారత ప్రభుత్వం పట్టుకుంది. తమ భూభాగంలో మీ నిర్మాణాలేంటని సూటిగా ప్రశ్నించింది.
కశ్మీర్ను అడ్డుగా చేసుకొని మనదేశాన్ని సతాయించాలనుకున్న డ్రాగన్కు సీపెక్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే సీపెక్ విషయంలో చైనా ప్రభుత్వం కిందామీదా పడుతోంది. అసలు ఆ ప్రాజెక్టు పూర్తవుతుందా లేదా అని టెన్షన్ పడుతోంది. ఇప్పుడు భారత ప్రభుత్వం పీఓకే, అక్సాయ్ చిన్లు తమవే అని తేల్చి చెప్పడంతో చైనా పాలకుల గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లైంది. ఎరక్కపోయి ఇరుక్కున్నామా అని చైనా పాలకులు మధనపడుతున్నారు.
Also watch :
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com