ఉభయగోదావరి జిల్లాలు సముద్రంలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది : చంద్రబాబు
By - TV5 Telugu |20 Sep 2019 9:11 AM GMT
పోలవరం విషయంలో వైసీపీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఒక వ్యక్తికి రిజర్వ్ చేశారని ఆరోపించారు. పోలవరంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల.. ఉభయగోదావరి జిల్లాలు సముద్రంలో కలిసిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. నచ్చిన సంస్థకు పనులు ఇవ్వడం కోసం ప్రాజెక్టు భద్రతను పక్కకు పెడతారా అని ప్రశ్నించారు. పోలవరం ఆపడం దుర్మార్గమైన చర్య అన్నారు టీడీపీ అధినేత.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com