ఉగ్రదాడిలో 53మంది సైనికులు మృతి
By - TV5 Telugu |2 Nov 2019 7:46 AM GMT
మాలిలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ మిలటరీ పోస్టుసై దాడికి తెగబడ్డారు. దీంతో 53మంది సైనికులు మరణించినట్లు అధికారులు తెలిపారు. మాలిలోని మేనక ప్రాంతంలో ఉన్న ఓ ఔట్ పోస్టును టార్గెట్ గా చేసుకున్న ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడికి సంబంధించి ఏ సంస్థ బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటివరకు ప్రకటించుకోలేదు. గత నెలరోజుల క్రితం బుర్కినో ఫాసోలో ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. మాలి ఉత్తర ప్రాంతంలో ఆల్ ఖాయిదా ఉగ్రవాదుల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. మాలి సైన్యం, ఫ్రెంచ్ దళాలు ఉగ్రవాదులపై దాడులు చేస్తున్నాయి. దీంతో ప్రతిదాడులకు దిగిన ఆల్ ఖాయిదా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com