రక్షించండి- రాజ్యాంగాన్ని రక్షించండి.. పేరుతో ఫ్లాగ్ మార్చ్ చేపట్టనున్న టి. కాంగ్రెస్
By - TV5 Telugu |19 Dec 2019 4:10 PM GMT
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది టి. కాంగ్రెస్. గాంధీభవన్లో సమావేశమైన కోర్కమిటీ మున్సిపల్ ఎన్నికలు, మద్య నియంత్రణ, అధికార పార్టీ వైఫల్యాలు, హామీల పై చర్చించారు.. ఈనెల 21 నుంచి 27 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టంపైనా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు..ఈనెల 28న జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశాన్ని రక్షించండి-రాజ్యాంగాన్ని రక్షించండి.. పేరుతో ఫ్లాగ్ మార్చ్ చేపట్టనున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com