విశాఖలోనే రిపబ్లిక్ డే వేడుకలు?
ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ఊరుకునేది లేదని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా.. రాజధానిని తరలించేందుకు ప్రభుత్వం తన పనిని తాను దూకుడుగా చేసుకుపోతోంది. నెల18న కేబినెట్ సమావేశంలో సచివాలయం తరలింపు షెడ్యూల్పై చర్చించే అవకాశం కనిపిస్తోంది. అదే రోజు అసెంబ్లీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం.
ఈనెల 23వ తేదీ లోపు సచివాలయం తరలింపు ప్రారంభం కావాలని జోతిష్యుల సూచించారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే 26న రిపబ్లిక్ డే వేడుకుల విశాఖలో జరిగే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం రిపబ్లిక్ డే కంటే ముందే జరగనుంది. విడతలవారీగా సచివాలయం తరలింపునకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 5 శాఖలను తరలించాలని హెచ్వోడీలకు ఆదేశాలు అందాయని తెలుస్తోంది. ఈ కొత్త సచివాలయం విశాఖలోని మిలీనియం టవర్స్లో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com