వైఫల్యాల నుంచే గుణపాఠాలు నేర్చుకుని విజయం సాధించాలి: పరీక్షా పే చర్చలో మోదీ

వైఫల్యాల నుంచే గుణపాఠాలు నేర్చుకుని విజయం సాధించాలి: పరీక్షా పే చర్చలో మోదీ

modi

వైఫల్యాల నుంచే గుణపాఠాలు నేర్చుకుని విజయం సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థులకు ఎగ్జామ్స్‌ సీజన్‌ సమీపిస్తుండటంతో.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఢిల్లీలోని టల్కటోరా స్టేడియమ్‌లో పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో వెయ్యి మందిని ఎస్సే కాంపిటిషన్‌ ద్వారా సెలెక్ట్ చేశారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. చంద్రయాన్‌ -2 మిషన్‌లో వైఫల్యాలను అధిగమించి.. ఇస్రో విజయ తీరాలవైపు వెళుతూ కొత్త పరిశోధనలు చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు మోదీ.

Tags

Read MoreRead Less
Next Story