వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచకాలు పెరిగిపోయాయి: ఎంపీ రామ్మోహన్ నాయుడు
By - TV5 Telugu |27 Jan 2020 6:30 PM GMT
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచకాలు పెరిగిపోయాయని తెలుగుదేశం పార్టీ ఎంపి రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, అచ్చెంనాయుడు ప్లేక్సీలపై అసభ్యకరంగా ప్రవర్తించారని, వారిపై చర్యలుతీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వీడియో ఆధారంగా టీడీపీ నేతలు ఎస్పీకి ఫిర్యాదుచేసినట్లు ఎంపి వెల్లడించారు. వైసీపీ నిరసనల్లో గ్రామ వాలంటీర్లు పాల్గొనడాన్ని ఆయన తప్పుపట్టారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com