ప్రజాచైతన్య యాత్ర ద్వారా పోరుబాటకు సిద్ధమైన చంద్రబాబు

ప్రజాచైతన్య యాత్ర ద్వారా పోరుబాటకు సిద్ధమైన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోరుబాటకు సిద్ధమయ్యారు. సర్కార్ నిర్ణయాలతో రాష్ట్రానికి కలుగుతున్న నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రజా చైతన్య యాత్రకు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి ప్రజా చైతన్య యాత్ర మొదలుపెట్టనున్నారు చంద్రబాబు నాయుడు.

రాష్ట్రంలో అసమర్థ, అరాచక పాలన సాగుతోందని చంద్రబాబు అన్నారు. ప్రజలను మోసగిస్తున్న తీరుపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే తాను యాత్ర చేపడుతున్నట్టు వివరించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజా చైతన్య యాత్రలో పెద్దసంఖ్యలో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను జనం మధ్య ఎండగట్టాలని సూచించారాయన. ప్రభుత్వ బాధితులకు టీడీపీ అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని పార్టీ శ్రేణులను చంద్రబాబు కోరారు.

Tags

Read MoreRead Less
Next Story