దుబాయ్‌లో ఆధునిక హంగులతో హిందూ మందిరం

దుబాయ్‌లో ఆధునిక హంగులతో హిందూ మందిరం

దుబాయ్‌లో ఆధునిక సదుపాయాలతో హిందూ మందిరం నిర్మితమవుతుంది. కొత్తగా 25 వేల చదరపు అడుగుల స్థలంలో మిలియన్ దిర్హాముల భారీ ఖర్చుతో హిందూ దేవాలయం జెబెల్ అలీలో నిర్మిస్తున్నారు. సింధి గురు దర్బార్ ఆలయ బోర్డు సభ్యులు గత వారం ఈ మందిరానికి శంఖుస్థాపన చేశారు. ఈ ఆలయం బర్ దుబాయ్‌లోని మందిరానికి పొడిగింపుగా ఉంటుందని ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త మరియు సింధి గురు దర్బార్ ఆలయ ధర్మకర్తలలో ఒకరైన రాజు ష్రాఫ్ ప్రకటించారు.

ఈ ఆలయాన్ని జెబెల్ అలీలోని గురు నానక్ దర్బార్ ప్రక్కనే నిర్మిస్తున్నారు. దీంతో చర్చి, సిక్కు గురు నానక్ దర్బార్ మరియు హిందూ మందిరం ఒకేచోట ఉంటాయి.. అందువల్ల ఈ ప్రాంతం దుబాయ్‌లోని బహుళ-మత కారిడార్‌గా ప్రఖ్యాతిగాంచుతుందని ష్రాఫ్ వివరించారు. సింధి గురు దర్బార్ కోసం భూమిని దుబాయ్ ప్రభుత్వం 2018 బహుమతిగా ఇచ్చిందని.. ఈ ఆలయ నిర్మాణం 2022 లో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ భవనంలో రెండు అంతస్తులు, రెండు బేస్మెంట్ అంతస్తులు మరియు భారీ పార్కింగ్ సదుపాయం ఉంటుంది.

ఆలయ రూపకల్పన మరియు నిర్మాణంలో ప్రత్యేకత కలిగిన టెంపుల్ ఆర్కిటెక్ట్స్ అనే భారతీయ నిర్మాణ సంస్థ ఈ ఆలయ రూపకల్పనను అందించింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 200 కి పైగా దేవాలయాలను రూపొందించింది. ఆలయ నిర్మాణానికి ఇప్పటికే దుబాయ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అథారిటీ నుండి అనుమతులు లభించాయి.

Tags

Read MoreRead Less
Next Story