బీసీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు: చంద్రబాబు

బీసీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు: చంద్రబాబు

స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పార్టీ ముఖ్యనేతలతో చర్చలు జరిపారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. న్యాయస్థానం తీర్పుతో.. బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నది స్పష్టమైందన్నారు. రైతులకు అన్యాయం చేసేందుకు న్యాయవాదికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు కూడా ప్రభుత్వం వెనకాడలేదన్నారు. రిజర్వేషన్ల విషయంలో మాత్రం సమర్ధుడైన న్యాయవాదిని పెట్టకుండా కేసును నీరుగార్చిందన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ది ఉంటే.. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలన్నారు చంద్రబాబు. సుప్రీంకోర్టు వెళ్తే... టీడీపీ కూడా ఇంప్లీడ్‌ అవుతుందన్నారాయన.

Tags

Read MoreRead Less
Next Story