పశ్చిమగోదావరి జిల్లాలో కలెక్టరేట్కు క్యూ కట్టిన అమ్మఒడి బాధితులు
By - TV5 Telugu |5 March 2020 4:10 PM GMT
అర్హులైనా సరే అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ది పొందని వారంతా పశ్చిమగోదావరి జిల్లాలో కలెక్టరేట్కు క్యూకట్టారు. వేల మంది అమ్మ ఒడి గ్రీవెన్స్కు తరలి రావడంతో కిలోమీటరు దూరం వరకూ క్యూ లైన్ కట్టాల్సి వచ్చింది. తల్లిదండ్రులంతా తమ పిల్లతో సహా కలెక్టరేట్కు వినతిపత్రాలు ఇచ్చేందుకు వచ్చారు. దీంతో గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించే గ్రీవెన్స్ హాల్కు వెళ్లే దారంతా కిక్కిరిసిపోయింది. ఒకే రోజు ఇంత మందిని పిలిచి ఇబ్బంది పెడుతున్నారని తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com