తాలిబన్ల నేరం కంటే అది తక్కువేం కాదు: కేంద్రమంత్రి

తాలిబన్ల నేరం కంటే అది తక్కువేం కాదు: కేంద్రమంత్రి

ఢిల్లీలో తబ్లీగ్ జమాత్ సమావేశాలు నిర్వహించడం తాలిబాన్ నేరానికి తక్కువ కాదని.. దీనిపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని కేంద్ర సహాయమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కోరారు. దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న సమయంలో ఇలాంటి సమావేశాలు పెట్టడం సరికాదని మండిపడ్డారు. సర్వశక్తిసంపన్నుడు అయిన అల్లాహ్ కూడా దీన్ని క్షమించడని.. వారి అజాగ్రత్తల వల్ల చాలామంది ప్రాణాలు ప్రమాదంలో పడటం దురదృష్టకరమని ముక్తార్ అబ్బాస్ అన్నారు. కరోనా ప్రబలకుండా శుక్రవారం నమాజ్ మసీదుల్లో చేయరాదని, వారి వారి ఇళ్లలోనే చేయాలని ముస్లిములందరూ స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నారని, అలా జమాత్ సమావేశాన్ని ఎందుకు వాయిదా వేసుకోలేదని కేంద్రమంత్రి ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story