ఏపీలో 192కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో 192కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో శనివారం ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు జరిగిన పరీక్షల్లో కొత్తగా 12 Covid-19 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ పేషంట్ ల సంఖ్య 192 కి పెరిగింది. అలాగే జిల్లాల వారీగా చూసుకుంటే.. విశాఖపట్నం 15, తూర్పు గోదావరి 11, పశ్చిమ గోదావరి 15, కృష్ణా 28, గుంటూరు 30, ప్రకాశం 21, నెల్లూరు 32, కడప 23, కర్నూలు 4, చిత్తూరు 10, అనంతపురం 3 గా నమోదయ్యాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 32 కేసులు నమోదయితే ఆ తరువాత గుంటూరు రెండో స్థానంలో నిలిచింది. ఇక శ్రీకాకుళం , విజయనగరం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.

Tags

Read MoreRead Less
Next Story