నెల్లూరు జిల్లాలో వైసీపి వర్గపోరు
By - TV5 Telugu |12 May 2020 10:26 AM GMT
నెల్లూరు జిల్లాలో వైసీపి వర్గపోరు బయటపడింది. కోట మండలం కేశవరం గ్రామ పంచాయితీ, రాఘవపురంలో కోడిగుడ్లు, అరటిపండ్ల పంపకంలో తలెత్తిన వివాదం కాస్తా.. చిలికి చిలికి దాడులకు దారితీసింది. దీంతో వైసీపీకి చెందిన ఇరువర్గాల వారు దాడులకు పాల్పడ్డారు. పోలీసులు ఇరువర్గాల వారికి నచ్చజెప్పేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com