ఏపీ ప్రభుత్వం జీవోతో తెలంగాణకు నష్టం జరుగుతోంది: రజత్ కుమార్
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కొత్త ప్రాజెక్టుల్ని ఆపాలని కృష్ణా రివర్స్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాశామని.. దీనిపై నేరుగా కలిసి వివరిస్తామన్నారు తెలంగాణ ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్. ఈ నెల ఐదున ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని తెలిపారాయన. ఆ జీవోలో శ్రీశైలం నుంచి నీటిని తరలించాలని ఉందని తెలిపారు. సంఘమేశ్వర పాయింట్ నుంచి 3 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు నుంచి 88 వేల క్యూసెక్కుల నీటిని తరలించాలని జీవోలో స్పష్టంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ తాగునీరు, సాగునీటికి ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. ఏపీతో కలిసి మెలిసి ఉండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందన్నారు. ట్రిబ్యునల్లో కృష్ణా జలాల కేటాయింపుల అంశం పెండింగ్లో ఉండగా... కొత్త ప్రాజెక్ట్లు చేపట్టడం సరికాదన్నారు రజత్కుమార్
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com