కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో కరోనా రోగి అదృశ్యం

కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో కరోనా రోగి అదృశ్యం

కర్నూలు ప్రభుత్వాస్పత్రి నుంచి కరోనా పేషంట్‌ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. చికిత్స పొందుతున్న వార్డు నుంచి అదృశ్యమైంది. దీంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఆమె కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కర్నూలు బస్ట్‌ స్టేషన్‌, రైల్వేస్టేషన్లలో ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఆదోని పట్టణానికి చెందిన 64 ఏళ్ల మహిళ కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ నెల 23న ఆమెను ఆదోని నుంచి కర్నూల్‌ కోవిడ్‌ ఆస్పత్రికి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story