ఎస్ఈసీ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది: నిమ్మగడ్డ రమేశ్కుమార్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో హైకోర్టు తీర్పును, ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని నిమ్మగడ్డ రమేశ్కుమార్ అన్నారు. ఈమేరకు ఆయన ప్రెస్నోట్ విడుదల చేశారు. శనివారం సర్కార్ ప్రకటించిన అంశాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుందని రమేశ్కుమార్ తన ప్రెస్నోట్లో అభిప్రాయపడ్డారు. SECగా జస్టిస్ కనగరాజ్ నియామకాన్ని న్యాయస్థానం తోసిపుచ్చిందని రమేశ్ కుమార్ అన్నారు. ఆ ఆర్డినెన్స్, జీవోలను హైకోర్టు కొట్టివేసిందని స్పష్టంచేశారు. ఎస్ఈసీగా ప్రభుత్వం తనను తొలగించలేదని గుర్తుచేశారు. హైకోర్టు తీర్పు అనంతరమే తాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమితులైనట్టు చెప్పారాయన. ఎస్ఈసీ స్వయం ప్రతిపత్తిని, సమగ్రతను దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని నిమ్మగడ్డ రమేశ్కుమార్ అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com