నేటినుంచి శ్రీవారిని దర్శించుకునే భాగ్యం..
దాదాపు రెండు నెలల తర్వాత తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలగనుంది. ఇవాల్టి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. టీటీడీ చేపట్టిన మూడ్రోజుల ట్రయల్ రన్ దర్శనాలు పూర్తయ్యాయి. మూడు రోజుల్లో 21,500 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. దాదాపు 31 వేల మందికి అన్న ప్రసాద వితరణ చేశారు. రెండు రోజులకు గాను 47 లక్షల రూపాయల హుండీ ఆదాయం సమకూరినట్లు తెలిపారు టీటీడీ అధికారులు. ట్రయల్ రన్ దర్శనంలో భాగంగా బుధవారం ఒక్కరోజే 7,200 మంది స్థానికులు దర్శించుకున్నట్లు తెలిపింది తెలిపింది..
ట్రయల్ రన్ విజయవంతం కావడంతో .. ఇక శ్రీవారిని దర్శించుకోనున్నారు సాధరణ భక్తులు. అయితే కంటైన్మెంట్, రెడ్ జోన్లలో ఉన్నవారు శ్రీవారి దర్శనానికి రావొద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది టీటీడీ. అలిపిరి వద్ద భక్తులకు థర్మల్ స్ర్కీనింగ్ చేయనున్నారు. భక్తుల్లో ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు ఉంటే క్వారంటైన్కు పంపుతామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. ప్రోజు ఉదయం 6:30 నుంచి రాత్రి 7:30 వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలిపారు.
ఇప్పటికే ఆన్లైన్లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా పూర్తయింది. ఇక ఆన్లైన్లో 60 వేల టికెట్లను 30 గంటల్లో భక్తులు కొనుగోలు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. లాక్డౌన్ నింబంధనలు పాటిస్తూ సోమవారం నుంచి ఆలయాలు తెరుచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. ఇవాల్టి నుంచి శ్రీవారిని దర్శించుకునే భాగ్యం దక్కనుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com