ఇంద్రకీలాద్రిపై ముగిసిన శాకాంబరీ ఉత్సవాలు

ఇంద్రకీలాద్రిపై ముగిసిన శాకాంబరీ ఉత్సవాలు

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధి ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ దేవి ఉత్సవాలు ముగిశాయి. ఆదివారం పూర్ణాహుతితో శాకాంబరీ దేవి ఉత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి మూడు రోజుల పాటు.. 30 టన్నుల కూరగాయలు పండ్లతో అలంకరణ చేసినట్లు ఈవో సురేష్ బాబు వెల్లడించారు.

శాకాంబరీ ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని శనివారం వరకు 9500 మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో తెలిపారు. ఆదివారం సాయంత్రం 7 గంటల వరకు అమ్మవారి దర్శనం కలిపిస్తున్నామన్నారు. ఆదివారం ఉత్సవాలు ఆఖరి రోజు కావడంతో అమ్మవారి దర్శనార్ధం భక్తులు తరలివస్తున్నారు. కూరగాయలు, పండ్ల రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story