హీరోయిన్ తండ్రికి పాజిటివ్..
By - TV5 Telugu |6 Aug 2020 4:52 PM GMT
బాలీవుడ్ నటీ నటులకు కరోనా ఎఫెక్ట్ బాగా తగులుతోంది. తాజాగా నటి దిశా పటాని తండ్రి జగదీష్ పటానీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ట్రాన్స్ఫార్మర్ కుంభకోణం దర్యాప్తు నేపథ్యంలో దిశా తండ్రి జగదీష్ పటానీ సహా మరో ఇద్దరు అధికారులు లక్నో నుంచి ముంబై వచ్చినట్లు తెలుస్తోంది. దాశా తండ్రి లక్నో విద్యుత్ శాఖ విజిలెన్స్ యూనిట్ లో ఎస్సీ హోదాలో పని చేస్తున్నారు. దర్యాప్తు నిమిత్తం ముంబై చేరుకున్న జగదీష్ తో పాటు మరో ముగ్గురుకి టెస్ట్ చేయగా పాజిటివ్ అని తెలిసింది. దీంతో ఆయన పని చేస్తున్న జోనల్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని 48 గంటల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com