సెప్టెంబర్ 6 వరకు లాక్డౌన్
కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో బిహార్ రాష్ట్రంలో లాక్డౌన్ ను మరోసారి పొడిగించాలని నితిష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం ఆగస్ట్ 17 నుంచి సెప్టెంబర్ 6 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ ఆంక్షలు అమల్లో ఉంటాయని రాష్ట్ర హోంశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ప్రైవేటు సహా అన్ని కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో పని చేస్తాయి. రైలు, విమాన సర్వీసులు యధాతథంగా కొనసాగుతాయి. కాగా, విద్యాసంస్థలు, మతపరమైన ప్రదేశాలు, బస్సు సర్వీసులు, పార్క్ లు, జిమ్ములు, ఇంకా మూసే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. బిహార్ లో కేసులు పెరుగుతున్న దృష్ట్యా జూలై 31 నుంచి ఆగస్ట్ 16 వరకు పొడిగించిన లాక్డౌన్ ని మరో 20 రోజుల పాటు లాక్డౌన్ ఆంక్షలు అమలులో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com