ఏపీలో కొత్తగా 172 కరోనా కేసులు!
coronavirus(File Photo)
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 38,323 కరోనా పరీక్షలు చేయగా, రాష్ట్రంలో కొత్తగా 172 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,87,238కు చేరింది. ఇందులో 1,357 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు 8,78,731 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనాతో ఒక్కరు మరణించగా మరణించగా ఆ సంఖ్య 7,150కి చేరింది. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 1,29,42,153 శాంపిల్స్ పరీక్షించింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
#COVIDUpdates: 26/01/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 26, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,84,343 పాజిటివ్ కేసు లకు గాను
*8,75,836 మంది డిశ్చార్జ్ కాగా
*7,150 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,357#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/pFvDGMuS35
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com