Nandyala: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టును ఢీకొన్న స్కార్పియో.. ముగ్గురు మృతి..

Nandyala: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టును ఢీకొన్న స్కార్పియో.. ముగ్గురు మృతి..
Nandyala: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం గూబగుంటమెట్ట వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Nandyala: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం గూబగుంటమెట్ట వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై స్కార్పియో వాహనం కల్వర్టును ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని నంద్యాల ఆస్పత్రికి తరలించారు.

మృతులు కడప జిల్లా మైదుకూరుకు చెందిన హోటల్ నిర్వాహకులు వేంకటేశ్వర్లు, సామ్రాజ్యం, విజయలక్ష్మిలుగా గుర్తించారు. వీరు బేతంచెర్ల మండలం మద్దిలేటయ్య స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్పార్పియో వాహనంలో ఇరుక్కున్నవారిని బటయకుతీసి ఆస్పత్రికి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story