Ap corona : ఏపీలో కొత్తగా 4.108 కరోనా కేసులు..!

Ap corona :  ఏపీలో కొత్తగా 4.108 కరోనా కేసులు..!
Ap corona : ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కరోనా కేసులు 4వేలు దాటాయి. కొత్తగా 4వేల 108 మంది వైరస్ బారిన పడ్డారు.

Ap corona : ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కరోనా కేసులు 4వేలు దాటాయి. కొత్తగా 4వేల 108 మంది వైరస్ బారిన పడ్డారు. చిత్తూరు, విశాఖపట్నం జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. విశాఖపట్నంలో 24గంటల్లోనే వెయ్యి కేసులు దాటాయి. చిత్తూరు జిల్లాలోనూ ఒక్కరోజులోనే వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో రేపటినుంచి చిత్తూరు జిల్లాలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్. నెలాఖరు వరకు జిల్లాలో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. మాస్కు లేకుంటే 100 రూపాయల ఫైన్ వేస్తామని హెచ్చరించారు. ఇక చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 50శాతం సామర్థ్యంతోనే థియేటర్లు నిర్వహించాలని పేర్కొన్నారు. ఇక మీటింగుల్లో 200మంది, పెళ్లి వేడుకల్లో 100మందికే అనుమతి ఉంటుందని తెలిపారు. అత్యవసర సేవలకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story