ఏపీలో కొత్తగా 947 కరోనా కేసులు
By - TV5 Digital Team |27 March 2021 12:45 PM GMT
ఆంధ్రప్రదేశ్లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 42 వేల 696 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 947 కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 42 వేల 696 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 947 కేసులు నమోదయ్యాయి. అయితే గడిచిన 24 గంటల్లో కోవిడ్ బారిన పడి ఎవరూ మరణించలేదు. దీంతో మృతుల సంఖ్య 7 వేల 203 కి చేరింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 8,97,810 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,715 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com