టీడీపీ నేత పట్టాభిపై దాడి కేసులో దర్యాప్తు వేగవంతం!

టీడీపీ నేత పట్టాభిపై దాడి కేసులో దర్యాప్తు వేగవంతం!
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. కమిషనరేట్‌ పరిధిలో ఉన్న ఏ1 రౌడీ షీటర్లందరినీ పోలీసులు విచారిస్తున్నారు.

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. కమిషనరేట్‌ పరిధిలో ఉన్న ఏ1 రౌడీ షీటర్లందరినీ పోలీసులు విచారిస్తున్నారు. దాడి రాజకీయ కోణంలో జరిగిందా..? వ్యక్తిగత కక్షలతో దాడి చేశారా..? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం 10 బృందాలు గాలిస్తున్నాయి.. ఒక స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ టీమ్‌ను కూడా సిటీ పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాస్‌ ఏర్పాటు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story