45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న హామీ ఏమైంది : రామానాయుడు ప్రశ్న
By - TV5 Telugu |23 July 2019 9:15 AM GMT
ఇవాళ సభ ప్రారంభం నుంచే హాట్హాట్గా జరిగింది. మేనిఫెస్టోలో హామీలు, పెన్షన్ల అంశాన్ని ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావించారు టీడీపీ ఉప నేత రామానాయుడు. 45 ఏళ్లకు పెన్షన్ ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. ఐతే.. తాము ఈ హామీ మేనిఫెస్టోలో ఎక్కడా ఇవ్వలేనదని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు. ఆ తర్వాత జగన్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటల వీడియో ప్లే చేశారు. ఈ వాదనను TDP తోసిపుచ్చింది. తమ దగ్గర ఆధారం ఉందని, జగన్ 45 ఏళ్లకు పెన్షన్పై ఇస్తామంటూ చెప్పారని ఆ వీడియో పెన్డ్రైవ్ ఇస్తామని సభలో ప్లే చేయాలని కోరారు. ఇక అక్కడి నుంచి మాటమాటా పెరిగి చివరకు సస్పెన్షన్కి దారి తీసింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com