ఏపీ మంత్రులు వీరే..

ఏపీ మంత్రులు వీరే..

మొత్తం 25 మందితో తన మంత్రివర్గ టీంను ప్రకటించారు ఏపీ సీఎం జగన్‌. వీళ్లంతా ఇవాళ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అన్ని సామాజిక వర్గాలకూ మంత్రివర్గంలో చోటుకల్పించారు జగన్‌. ఏడుగురు బీసీలను తీసుకున్నారు. ఎస్సీ వర్గానికి చెందిన ఐదుగురికి అవకాశం ఇవ్వగా వీరిలో మాదిగ వర్గానికి 2, మాల వర్గానికి 3 కేటాయించారు. కాపు, రెడ్డి వర్గాలకు నాలుగుచొప్పున ఇచ్చారు. వైశ్య, క్షత్రియ, కమ్మ, మైనార్టీ వర్గాలకు ఒక్కో మంత్రి పదవి కేటాయించారు.

జగన్‌ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నవారిలో శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన కృష్ణదాస్‌, విజయనగరం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ , పాముల పుష్ప శ్రీవాణిలకు స్థానం కల్పించారు. భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌ మంత్రి వర్గంలో చోటు కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి కురసాల కన్నబాబు , పినిపె విశ్వరూప్‌, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ లకు స్థానం దక్కింది. కృష్ణా జిల్లానుంచి కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పేర్నినానిలకు మంత్రివర్గంలో చోటు దక్కింది.

గుంటూరు జిల్లా నుంచి మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ కేబినెట్‌లో జగన్‌ చోటు కల్పించారు. పశ్చిమగోదావరి నుంచి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు , తానేటి వనిత, ఆళ్ల నానిలకు కేబినెట్‌లో స్థానం దక్కింది. ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, అదిమూలపు సురేష్ లకు‌, కర్నూలు నుంచి బుగ్గన రాజేంద్ర రెడ్డి, గుమ్మనూరు జయరాంలకు మంత్రివర్గంలో చోటు లభించింది.

నెల్లూరు నుంచి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌లకు కేబినెట్‌లో స్థానం లభించింది. చిత్తూరు జిల్లా నుంచి నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు.. కడప నుంచి అంజాద్ బాషా, అనంతపురం నుంచి శంకర్‌నారయణలకు తన మంత్రి వర్గంలో సీఎం జగన్‌ స్థానం కల్పించారు.

Tags

Read MoreRead Less
Next Story