ఏపీలో ఆగని కరోనా విజృంభణ.. మరోసారి పదివేలకు పైగా కేసులు..

ఏపీలో ఆగని కరోనా విజృంభణ.. మరోసారి పదివేలకు పైగా కేసులు..
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 70,993 శాంపిల్స్ ని పరీక్షించగా..

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 70,993 శాంపిల్స్ ని పరీక్షించగా 10,601 మంది కోవిడ్‌-19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కోవిడ్‌ వల్ల గుంటూరు లో పది మంది, అనంతపూర్‌ లో ఎనిమిది మంది, చితూర్‌ లో ఎనిమిది మంది, కడప లో ఏడుగురు, ప్రకాశం లో ఏడుగురు, నెలూరు లో ఆరుగురు, విశాఖపట్నం లో ఆరుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు, పశ్చిమ గోదావరి లో ఐదుగురు, శ్రీకాకుళం లో ముగ్గురు, కర్నూల్‌ లో ఇద్దరు , విజయనగరం లో ఒక్కరు మరణించారు. గడచిన 24 గంటల్లో 11,691 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 5,14,199 పాజిటివ్ కేసు లకు గాను 4,12,870 మంది డిశ్చార్జ్ కాగా.. 4,560 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 96,769 గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story