నాలుగు ఉద్యోగాలకు ఒకే పరీక్ష.. మరిన్ని వివరాలు..

నాలుగు ఉద్యోగాలకు ఒకే పరీక్ష.. మరిన్ని వివరాలు..

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీకి సంబంధించి మొత్తం 1.28 లక్షల ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 19 రకాల ఉద్యోగాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఒక్కో కేటగిరీలో ఉన్న పోస్టులన్నింటికీ ఒకే రాత పరీక్ష నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన పరీక్షను సెప్టెంబర్ 1న రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆగస్ట్ 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

కేటగిరీ-1లో పోస్టులకు ఒకే పరీక్ష..

సెప్టెంబర్ 1న ఉదయం కేటగిరీ-1, కేటిగిరీ-2 ఉద్యోగాలకు వేర్వేరుగా రాతపరీక్ష నిర్వహిస్తారు. అన్ని పోస్టులకు ఒకే రాతపరీక్ష ఉంటుంది. అదేవిధంగా కేటగిరి-3 లోని ఉద్యోగాల భర్తీకి కూడా సెప్టెంబర్ 1న రాతపరీక్ష నిర్వహిస్తారు. కేటగిరీ-3లో ఒక్కో పోస్టుకు ఒక్కో విధమైన రాత పరీక్ష ఉంటుంది. పరీక్షలు ఒకే రోజు నిర్వహించడం వలన కేటగిరీ-1, కేటగిరీ-2లోని పోస్టులతో పాటు.. కేటగిరీ-3 లోని పోస్టుకు కూడా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రాత పరీక్షకు హాజరయ్యే వెసులుబాటు ఉంటుంది. కేటగిరీ-1 పరిధిలో పంచాయితీ సెక్రటరీ, వెల్ఫేర్ & విద్యాధికారి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, మహిళా పోలీస్ & స్త్రీ శిశు సంక్షేమ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకానికి రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో సెప్టెంబరు మొదటి వారంలో జరుగుతుంది. సెప్టెంబరు మూడో వారంలో ఫలితాలు ప్రకటిస్తారు. అదే నెల నాలుగో వారంలో నియామకపత్రాలు అందజేస్తారు.

గ్రామ సచివాలయాల్లో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు.. పంచాయతీ కార్యదర్శి.. వీఆర్వో.. సర్వే అసిస్టెంట్.. ఏఎన్ఎం.. వెటర్నరీ/ఫిషరీస్ అసిస్టెంట్.. మహిళా పోలీస్ & ఉమెన్ చైల్డ్.. ఇంజనీరింగ్ అసిస్టెంట్.. ఎనర్జీ అసిస్టెంట్.. అగ్రికల్చర్/హార్టికల్చర్ ఎంపీఈవో.. డిజిటల్ అసిస్టెంట్.. వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్.. వార్డు సచివాలయాల్లో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు.. కార్యదర్శి.. మౌలిక వసతుల కార్యదర్శి.. శానిటేషన్ కార్యదర్శి.. విద్యా కార్యదర్శి.. ప్రణాళిక కార్యదర్శి.. వెల్ఫేర్ సెక్రటరీ.. డెవలప్‌మెంట్ సెక్రెటరీ.. ఇంధన కార్యదర్శి.. ఆరోగ్య కార్యదర్శి.. రెవెన్యూ కార్యదర్శి.. మహిళా సంరక్షణ కార్యదర్శి.. స్టైఫండ్ రూ.15 వేలు.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అక్టోబరు 2న విధుల్లో జాయిన్ అవుతారు. నియామకాలు పొందిన వారికి రూ.15వేల స్టైఫండ్ చెల్లించాని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత శాశ్వత పేస్కేలు వర్తిస్తుంది. రెండేళ్ల ప్రొబెషనరీ పీరియడ్ అమల్లో ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story