మున్సిపల్‌ ఎన్నికలు.. విజయమే లక్ష్యంగా టీడీపీ వ్యూహాలకు పదును

మున్సిపల్‌ ఎన్నికలు.. విజయమే లక్ష్యంగా టీడీపీ వ్యూహాలకు పదును
మున్సిపల్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు

మున్సిపల్‌ ఎన్నికల్లోనూ పంచాయతీ జోష్‌ను ఏమాత్రం సడలనివ్వొద్దన్న పట్టుదలతో ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇందుకోసం గురువారం నుంచి మున్సిపల్‌ ఎన్నికలు జరిగే చోట్ల ప్రచారం నిర్వహించనున్నారు. కర్నూలు, చిత్తూరు, విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాలో చంద్రబాబు 4 నుంచి 8 వరకు 5 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 4న కర్నూలు జిల్లాలో, 5న చిత్తూరు జిల్లాలో, 6న విశాఖ జిల్లాలో, 7న విజయవాడలో, 8న గుంటూరు జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేస్తారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు సత్తాచాటారు. ఈ జోష్‌తో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. త్వరలో తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్నందున.. పురపాలక ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకునట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు.. మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. టీడీపీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ గెలిచిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జగన్‌ ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్ను తగ్గిస్తూ కౌన్సిల్‌ మొదటి సమావేశంలోనే తీర్మానం చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఆస్తి పన్ను పెరగడం వల్ల ఇంటి అద్దెలు పెరిగి మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రిజిస్టర్‌ విలువ ఆధారంగా పట్టణాల్లో భారీగా ఆస్తి పన్ను పెంచేందుకు జగన్‌ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామన్నారు. జగన్‌కు ఓటేస్తే ప్రజలపైనే భారం పడుతుందన్నారు చంద్రబాబు. ఇసుక, సిమెంట్‌, గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌, వంట నూనెల ధరల పెరుగుదలతో సామాన్యులపై భారం పడిందన్నారు.

కష్టకాలంలో పోరాడితేనే నాయకులకు ప్రజల్లో గుర్తింపు వస్తుందని చంద్రబాబు చెప్పారు. వైసీపీ బెదిరింపులకు భయపడి నామినేషన్లు వెనక్కు తీసుకోవడం పిరికిచర్యగా అభివర్ణించారు. మద్యం సీసాలు వాళ్లే తెచ్చిపెట్టి.. టీడీపీ వారిపై కేసులు పెట్టడానికైనా అధికార పార్టీ నేతలు వెనకాడరన్నారు. ఇలాంటి వాళ్ల పట్ల నాయకులు జాగ్రత్త పడాలని సూచించారు. ధైర్యంగా పోరాడాలన్నారు.. ఏదైనా ఘటన జరిగితే తాను కూడా వచ్చి పోరాడతానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రతి ఇల్లూ తిరిగి ప్రభుత్వ దుర్మార్గ పాలనను ప్రజలకు వివరించాలన్నారు.

మరోవైపు మున్సిపల్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. స్వయంగా ఆయనే రంగంలోకి దిగి.. టీడీపీ శ్రేణుల్ని ఉత్తేజపర్చనున్నారు. ఈనెల 4 నుంచి చంద్రబాబు ఐదు రోజులపాటు మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కర్నూలు, చిత్తూరు, విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story