ఏపీలో కరోనా విజృంభిస్తోన్నా ప్రభుత్వంలో మాత్రం చలనం రావడం లేదు : అయ్యన్నపాత్రుడు

ఏపీలో కరోనా విజృంభిస్తోన్నా ప్రభుత్వంలో మాత్రం చలనం రావడం లేదు : అయ్యన్నపాత్రుడు
ఏపీలో కరోనా విజృంభిస్తోన్నా ప్రభుత్వంలో మాత్రం చలనం రావడం లేదని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు.

ఏపీలో కరోనా విజృంభిస్తోన్నా ప్రభుత్వంలో మాత్రం చలనం రావడం లేదని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ఎమర్జెన్సీగా పరిగణించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. కానీ సీఎం జగన్ కు ఎమర్జెన్సీ అర్థం లేదన్నారు. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పరీక్షలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో.. ప్రాణాలు కూడా అంతే ముఖ్యమని.. తక్షణమే పరీక్షలు నిర్వహించి వారిని కాపాడాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story