Balakrishna: ఆసుపత్రి సూపరింటెండెంట్‌‌పై ఆగ్రహించిన బాలకృష్ణ..

Balakrishna (tv5news.in)

Balakrishna (tv5news.in)

Balakrishna: సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గం హిందూపురంలో రెండో రోజు పర్యటిస్తున్నారు.

Balakrishna: సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లాలోని తన సొంత నియోజకవర్గం హిందూపురంలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఎంజీఎం హైస్కూల్‌ ప్రాంగణంలో ఆరు ప్రభుత్వ పాఠశాలలకు 12 లక్షలు విలువచేసే ప్రాజెక్టర్లు, కంప్యూటర్లను బాలకృష్ణ అందజేశారు. వీటిని హెరిటేజ్‌ సంస్థ అందజేసింది. ప్రతి విద్యార్థి చదువులో బాగా రాణించి తల్లిదండ్రులకు, దేశానికి మంచి పేరు తీసుకు రావాలని బాలకృష్ణ అన్నారు.

అంతకుముందు హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యంతో పాటు వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో రెండు రోజుల కిందట తన బిడ్డ చనిపోయిందంటూ శ్రావణ్ అనే వ్యక్తి బాలకృష్ణ ముందు కన్నీటిపర్యంతమయ్యాడు. దీంతో ఆగ్రహించిన బాలకృష్ణ.. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ని పిలిచి ఆరా తీశారు.

హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి పనితీరుపై బాలకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం డీఆర్‌ కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే ప్రకృతి సంపద చాలా విలువైనదని, చెట్లను నరక వద్దని, మొక్కలు నాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story