అధికారులు సీఎం జగన్ కు భజన చేస్తున్నారు : బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

అధికారులు సీఎం జగన్ కు భజన చేస్తున్నారు : బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

కేంద్రం అందిస్తున్న కరోనా సాయాన్ని మత ప్రాతిపదికన పాస్టర్లకు 5వేల రూపాయలు చొప్పున కేటాయించడం దారుణమని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి మండిపడ్డారు. పాస్టర్లుగా ఉంటూ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్లతో లబ్ధిపొందుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహరంపై కేంద్రం విచారణకు ఆదేశించిందని తెలిపారు. కేంద్ర పథకాలకు వైఎస్ఆర్, జగనన్న పేర్లు పెట్టి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, అధికారులు సీఎం జగన్ భజన చేస్తున్నారని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story