చేతబడి చేస్తున్నారని మహిళతో పాటు ఓ వ్యక్తికి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు

చేతబడి చేస్తున్నారని మహిళతో పాటు ఓ వ్యక్తికి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
కామాక్షి, హనుమంతును ఆ గ్రామస్తులు ఇద్దరిని నిర్బంధించి దేహశుద్ధి చేసి కొయ్యలగూడెం పోలీసులకు అప్పజెప్పారు.

పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయగూడెం గ్రామంలో చేతబడి కలకలం రేగింది. చిన్నాయగూడెం గ్రామ పొలిమేరలో గల గంగానమ్మ గుడి వద్ద గ్రామ వీధుల్లో ఎరుపు , పసుపు రంగు నీళ్లు చల్లుతూ గ్రామస్తులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారంటూ గ్రామస్తులు.. ఒక మహిళతో పాటు మరో వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. గతంలో కూడ ఆరిపాటిదిబ్బలు గ్రామం వద్ద చేతబడి చేస్తున్నారంటూ ఇప్పుడు పట్టుబడిన కామాక్షి, హనుమంతును ఆ గ్రామస్తులు ఇద్దరిని నిర్బంధించి దేహశుద్ధి చేసి కొయ్యలగూడెం పోలీసులకు అప్పజెప్పారు.

మళ్లీ ఇప్పుడు అదే మహిళ.. హనుమంతు అనే వ్యక్తితో కలిసి చిన్నాయగూడెం గ్రామంలో కూడ ఇదేవిధంగా చేయడంతో గ్రామస్తులు తీవ్రభయభ్రాంతులకు గురయ్యారు. చిన్నాయగూడెం సమీపంలోని గంగానమ్మ గుడి దగ్గర పూజలు చేస్తోన్న ఈ ఇద్దరినీ నిర్బంధించి దేహశుద్ధి చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించడానికి ప్రయత్నిస్తుండగా గ్రామస్తులు అడ్డుకుని వారిద్దరినీ తమకు అప్పజెప్పాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో.. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story