ఏపీ రాజధాని విషయంలో తప్పు దిద్దుకున్న కేంద్రం ..!

ఏపీ రాజధాని విషయంలో తప్పు దిద్దుకున్న కేంద్రం ..!
ఏపీ రాజధాని విషయంలో కేంద్రం తన తప్పు దిద్దుకుంది. ఏపీ క్యాపిటల్‌ విశాఖ కాదని క్లారిటీ ఇచ్చింది. విశాఖ కేవలం ఏపీలోని ఓ నగరం మాత్రమేనని స్పష్టంగా చెప్పింది.

ఏపీ రాజధాని విషయంలో కేంద్రం తన తప్పు దిద్దుకుంది. ఏపీ క్యాపిటల్‌ విశాఖ కాదని క్లారిటీ ఇచ్చింది. విశాఖ కేవలం ఏపీలోని ఓ నగరం మాత్రమేనని స్పష్టంగా చెప్పింది. పెట్రోలియం ట్యాక్స్‌లకు సంబంధించిన రిప్లైలో విశాఖ పేరును మాత్రమే ఉదహరించామని చెప్పుకొచ్చింది. హెడ్డింగ్‌లో రాజధాని అని ఉన్న చోట విశాఖ అని రాయడం వల్ల ఈ తప్పిదం జరిగినట్టు కేంద్రం ఒప్పుకుంది. జులై 26న లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఏపీ రాజధాని వైజాగ్ అని అర్థం వచ్చేలా కేంద్రం సమాధానమిచ్చింది. అయితే, ఏపీ రాజధాని విశాఖ అని చెప్పటం తమ ఉద్దేశం కాదని కేంద్రం స్పష్టం చేసింది.

పెట్రో ధరల పెరుగుదల వల్ల దేశంపై పడుతున్న ప్రభావం, వివిధ రాష్ట్రాల్లోని నగరాల్లో విధిస్తున్న పన్నుల గురించి కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఇందులో వివిధ రాష్ట్రాల పేర్లు, దాని పక్కనే రాజధాని అని ఉన్న చోట విశాఖ అని పెట్టి.. రిప్లై ఇచ్చింది. ఒక్క విశాఖనే కాదు హర్యానా రాజధాని అంబాలా అని, పంజాబ్‌కు జలంధర్‌ అని పెట్టి పంపించింది కేంద్రం. దీంతో సోషల్ మీడియాలో రాజధానులపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేంద్రం తీరుపై సెటైర్లు కూడా వేశారు. ఆలస్యంగానైనా స్పందించిన కేంద్రం ఈ తప్పును సరిదిద్దుకుంటున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

ఏపీ రాజధాని విషయంలో కేంద్రం పొరపాటు పడడం ఇదొక్కసారే కాదు. చాలాసార్లు ఇవే తప్పిదాలు చేసింది. ఏపీ రాజధాని హైదరాబాద్‌ అంటూ ఒకసారి, అమరావతి అంటూ మరోసారి కేంద్రం లేఖలు పంపుతోంది. లోక్‌సభకు ఇచ్చే కొన్ని సమాధానాల్లోనూ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌ అని చూపెడుతోంది. ఏపీలో రాజధాని అనే అంశంపై ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలిసి కూడా ఈ తప్పిదాలు చేస్తోంది కేంద్రం.

Tags

Read MoreRead Less
Next Story