Chandrababu: వైసీపీ సైకోల నుంచి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి-చంద్రబాబు
By - Divya Reddy |5 May 2022 8:40 AM GMT
Chandrababu: విశాఖలో టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు.
Chandrababu: విశాఖలో టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. గ్రామాల్లో టీడీపీ నేతలు ఐక్యంగా ఉండాలని సూచించారు. వైసీపీ సైకోల నుంచి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలని.. పార్టీ తరపున పోరాడి రాష్ట్రాన్ని సైకోల నుంచి కాపాడుతానన్నారు. రాక్షసులను అంతమొందించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత టీడీపీదేనన్నారు చంద్రబాబు.
ఇలాంటి వైసీపీ సైకోలను చాలా మందిని చూశానని.. తీవ్రవాదాన్ని అణచివేశాం, మతవిద్వేషాలను తొక్కి పెట్టామన్నారు. రౌడీల అంతు చూశాం.. సైకోలు ఓ లెక్కా అన్నారు చంద్రబాబు. కేసులు పెడితే ఏమవుతుందన్నారు. మనం బాబాయిని చంపామా? కోడికత్తి డ్రామాలాడామా? అన్నారు. కేసులు పెడితే ట్రిబ్యునల్ వేస్తాం, దొంగ కేసులు పెట్టిన వారిని శిక్షిస్తామన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com