Chandrababu Naidu : వంగవీటి రాధాకు చంద్రబాబు ఫోన్‌..!

Chandrababu (tv5news.in)

Chandrababu (tv5news.in)

Chandrababu Naidu : టీడీపీ నేత వంగవీటి రాధాకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్‌ చేశారు.. రాధాపై రెక్కీ నిర్వహించిన వ్యవహారం ఏపీ తీవ్ర కలకలం రేపుతుండగా దీనిపై రాధాకు ఫోన్‌ చేసి ఆరా తీశారు చంద్రబాబు..

Chandrababu Naidu : టీడీపీ నేత వంగవీటి రాధాకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్‌ చేశారు.. రాధాపై రెక్కీ నిర్వహించిన వ్యవహారం ఏపీ తీవ్ర కలకలం రేపుతుండగా దీనిపై రాధాకు ఫోన్‌ చేసి ఆరా తీశారు చంద్రబాబు.. గన్‌మెన్‌లను తిరస్కరించడం సరికాదన్నారు.. భద్రత విషయంలో అశ్రద్ధ వద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.. రాధాకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.. కుట్ర రాజకీయాలపై పార్టీ పరంగా పోరాడదామని సూచించారు చంద్రబాబు.

తన హత్యకు కొందరు రెక్కీ నిర్వహించారన్న వంగవీటి రాధా వ్యాఖ్యల నేపథ్యంలో టూ ప్లస్‌ టూ గన్‌మెన్లను ప్రభుత్వం కేటాయించింది. అయితే ప్రభుత్వం కేటాయించిన గన్‌మెన్లను వంగవీటి రాధా తిరస్కరించారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తినని, తనకు గన్‌మెన్లు వద్దన్నారు. అభిమానులు, అనుచరులే తనకు రక్షణ అంటూ చెప్పుకొచ్చారు. తన క్షేమంపై అన్ని పార్టీల నేతలు ఫోన్‌ చేసి అడిగారన్నారు రాధా. పోలీసులు సంప్రదిస్తే పూర్తి వివరాలిస్తానని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story