విజయవాడ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు దూకుడు

విజయవాడ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు దూకుడు
రాష్ట్రంలో విధ్వంసం పాలన కొనసాగుతోందని..ఈ ఎన్నికల ద్వారా ప్రజలు ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

కేంద్రం మెడలు వంచుతానని.. జగన్ మెడలు దించాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. విజయవాడలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చెప్పినట్లుగా మంత్రులు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో అప్పులు, అవినీతి పెరిగిపోయాని మండిపడ్డారు. రాష్ట్రంలో విధ్వంసం పాలన కొనసాగుతోందని.. ఈ ఎన్నికల ద్వారా ప్రజలు ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

వైసీపీ 22 నెలల పాలనలో విజయవాడలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల ముందు జగన్ అమరావతిని మార్చనని చెప్పి.. తర్వాత మూడు ముక్కలాట ఆడుతున్నాడని మండిపడ్డారు. వైసీపీ పాలనలో కబ్జాలు, అవినీతి, బెదిరింపులే తప్ప.. అభివృద్ది ఎక్కడని ప్రశ్నించారు.

అమరావతిని కాపాడుకునేందుకు ఇంటికొకరు బయటకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. 22 నెలల పాలనలో ఏం అభివృద్ధి చెశారో చెప్పాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమరావతిని నాశనం చేశారని..

మొత్తానికి ఎన్నికల ప్రచారంతో తనదైన శైలిలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ క్యాడర్ లో జోష్‌ నింపారు చంద్రబాబు.


Tags

Read MoreRead Less
Next Story