Chandrababu: నన్ను ఎవరైనా విమర్శిస్తే బొజ్జల ఊరుకునే వారు కాదు: చంద్రబాబు

Chandrababu: నన్ను ఎవరైనా విమర్శిస్తే బొజ్జల ఊరుకునే వారు కాదు: చంద్రబాబు
Chandrababu: మాట చెబితే తూచా తప్పకుండా అమలు చేసే వ్యక్తి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Chandrababu: మాట చెబితే తూచా తప్పకుండా అమలు చేసే వ్యక్తి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. విద్యార్థి దశ నుంచే తనకు బొజ్జలతో పరిచయం ఉందన్నారు. ప్రజల కోసం నిత్యం పనిచేసే వ్యక్తి అని కొనియాడారు. శ్రీకాళహస్తి అభివృద్ధిపై తనతో ఎప్పుడూ మాట్లాడేవారని.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారన్నారు.

శ్రీకాళహస్తి ప్రజలు గోపాలకృష్ణారెడ్డిని ఎప్పటికీ మరిచిపోలేరన్నారు. ఆప్తమిత్రుడిని కోల్పోయానని.. చాలా బాధ కలుగుతోందన్నారు చంద్రబాబు. తనను ఎవరైనా విమర్శిస్తే ఊరుకునేవారు కాదని.. విలువలు, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి బొజ్జల అని అన్నారు. బొజ్జల అత్త లక్ష్మీదేవమ్మ మృతి కూడా బాధ కలిగించిందన్నారు. బొజ్జల కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story